Friday, March 21, 2008

'కరుణా' నీకిది తగునా?

'కరుణా' నీకిది తగునా!!!!!!!

నోటి దురద + పైత్యం + గుమ్మడి కాయంత వెర్రి = కరుణానిధి. వయసు మీద పడ్డ ఈ కురువ్రుధ్దుడుకి చూపుతో పాటు "మతి" మందగించినట్టుంది. ఈయన గారికి రాముడంటే ఎందుకో అంత మంట. "రావణ" సంతతి అధికారం చేపడితే ఇలాగే ఉంటుంది. పందికేం తెలుసు పాండ్స్ పౌడరు వాసన. ఈ భారతావనిలొ రాముడి గొప్పతనం పురుటిలోని బిడ్డకైనా తెలుస్తుంది కాని తలకాయలో మెదడు లేని వాడికేం తెలుస్తుంది. ఈ దేశంలొ పుట్టి, గద్దెనెక్కి విర్రవీగుతున్న "ఈనెల తక్కువ వాడి" కంటే విదేశి అయిన "మేడం" చాలా నయం. ఇది మన దౌర్భాగ్యం కాక మరేమిటి!!! మన రాజ్యాంగం ప్రకారం ఏ వ్యక్తైనా ఒకమతం వారిని ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యంలు చేసినా శిక్షార్హుడౌతాడు. కాని ఇప్పుడు అలా జరుగుతుందా? లేదే. "శాంతి", "సహనం", "సమానత్వం" అంటూ మనల్ని మనం మోసం చేసుకుంటూ జీవితాన్ని వెల్లదీస్తున్న "మెజారిటి" ప్రజలకి జరగాల్సిన శాస్తే ఇది. హిందూ దేశం అంటూ మనల్ని మనం మోసం చేసుకొంటూ జీవితాల్ని వెల్లదెస్తున్న "మెజారిటి" బ్రతుకులు మనవి. ఈ హిందూ దేశంలో హిందూ అరాధ్య దేవుళ్ళని, దేవతలని వెటకారంగా వెక్కిరిస్తున్నా "శాంతి","సహనం" అంటూ మనల్ని మనం సర్దిచెప్పుకొని జీవితాల్ని వెల్లడీస్తున్న మనల్ని మనం ఏమనుకోవాలి? నోరు పారేసుకొనే ఇలాంటి నేతల్ని కట్టడి చేయలేమా? ఆ ఏకపత్నీ వ్రతుడు గురించి మాట్లాదే అర్హత ఈ భారతావనిలొ ఏ రాజకీయ నాయకుడికి లేదు.

No comments: